News March 7, 2025

శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. శ్రీకాకుళం వాసులు ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, విజయనగరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News February 14, 2026

అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

image

హైదరాబాద్ వేదికగా ఐ‌ఎల్‌ఎ‌హెచ్‌ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.

News February 14, 2026

శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

image

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.

News February 14, 2026

శ్రీకాకుళం: పెరిగిన జీతాలు.. హర్షం వ్యక్తం చేసిన 108 సిబ్బంది

image

సీఎం చంద్రబాబు నాయుడు 108 సిబ్బంది జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈఎంటీలు 79, పైలెట్లు 79 మందికి ఈ నిర్ణయంతో వీరికి రూ.2,000లు అదనంగా వేతనం కలిపి అందనుంది. అంతేకాకుండా 5, 10 సంవత్సరాల్లో సర్వీస్ చేసిన వారికి ఆటోమెటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ చేయడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.