News July 22, 2024
శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS
➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ
Similar News
News October 8, 2024
దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి
మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
News October 8, 2024
శ్రీకాకుళం: ‘సముద్రతీరానికి తీసుకెళ్లి అత్యాచారం’
ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. SI రంజిత్ తెలిపిన వివరాలు.. పోలాకి మండలానికి చెందిన బాలికతో నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన డొంకాన రాముకు పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో బాలికను ఆదివారం పోలాకిలోని సముద్రతీరానికి తీసుకెళ్లాడు. ఇంటికొచ్చాక తల్లి ప్రశ్నించగా విషయం బయటపడింది. కుమార్తెపై అత్యాచారం జరిగినట్లు SPకి ఫిర్యాదుచేసింది. రాముపై పోక్సో కేసు నమోదుచేసినట్లు చెప్పారు.
News October 8, 2024
ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.