News April 10, 2024

శ్రీకాకుళం: జీడిపంటకు భారీ నష్టం

image

జిల్లా వ్యాప్తంగా 46,743.63 ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. అందులో ఒక్క పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోనే సుమారు 24,753 ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుండగా, సుమారు 13వేల మందికి ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కొన్ని తెగుళ్ల వల్ల పంటకు భారీ నష్టం వాటిల్లింది. 

Similar News

News September 10, 2025

SKLM: అప్పారావు నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, ఉమశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News September 10, 2025

ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

image

ఆమదాలవలసలోని చిట్టివలసకు చెందిన నవిరి పూర్ణ (22) వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు.

News September 10, 2025

శ్రీకాకుళం: డయల్ యువర్ కలెక్టర్

image

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య డయల్ యువర్ కలెక్టర్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. ఎరువులు సంబంధిత విషయాలపై డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎరువులు, సంబంధిత విషయాలుపై ఈ కార్యక్రమం ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చును. ఫోన్ నంబర్ 09842 222565, 08942 222648లకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.