News September 29, 2025
శ్రీకాకుళం జూనియర్ లెక్చరర్ సంఘ అధ్యక్షుడిగా మల్లేష్

శ్రీకాకుళం జిల్లా జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా డాక్టర్ హెచ్ మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల అధికారి నారాయణరావు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా బి వెంకట మోహన్, కార్యదర్శిగా రమేష్, జాయింట్ సెక్రటరీగా పెనుగుదురు ప్రసాదరావు ఎన్నికయ్యారని ఆయన వివరించారు. కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.
Similar News
News September 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

★టెక్కలి: పాముకాటుకు రైతు మృతి
★కాశీబుగ్గ: బండి ముందుకెళ్తే.. గుంతలోకి చక్రం
★శ్రీకాకుళం: ఫోటోగ్రఫీ కళా ప్రదర్శన పోటీలకు ఆహ్వానం
★ టెక్కలి: లేడీస్ కార్నర్లో అగ్నిప్రమాదం
★ కంచిలి సంతలో ట్రాఫిక్ కష్టాలు
★ శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్కు 78వ ర్యాంకు
★ జిల్లాలో పలుచోట్ల వైసీపీ డిజిటల్ బుక్పై కార్యక్రమాలు
★ శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
News September 28, 2025
టెక్కలి: పాముకాటుకు రైతు మృతి

టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన కూర్మారావు(65) అనే రైతు ఆదివారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని పంట పొలంలో ఎరువులు చల్లుతున్న సమయంలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సమీపంలో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
News September 28, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ఈనెల 29న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. https://Meekosam.ap.gov.in వెబ్సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అర్జీలు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబరుకు నేరుగా ఫోన్ చేయవచ్చునని
ఆయన చెప్పారు.