News April 23, 2025
శ్రీకాకుళం : టెన్త్ రిజల్ట్స్.. 23,219 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,219 మంది పాసయ్యారు. 14,287 మంది బాలురు రాయగా 11,358 మంది పాసయ్యారు. 13,889 మంది బాలికలు పరీక్ష రాయగా 11,861 మంది పాసయ్యారు. 82.41 పాస్ పర్సంటేజ్ తో శ్రీకాకుళం జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలవగా.. 14వ స్థానానికి పడిపోయింది.
Similar News
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★శ్రీముఖలింగం: చక్రతీర్థస్నానాలకు పోటెత్తిన భక్తులు
★నందిగాం: వృక్షం వేర్లు ఆలయానికి రక్షణ
★వంశధార ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
★పలాస: చైన్ స్నాచింగ్ చేస్తుండగా పట్టేశారు
★ఆదిత్యుని సన్నిధిలో ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్
★శ్రీకాకుళం: ఈనెల 20న జాబ్ మేళా
★ఎల్.ఎన్ పేట: నదీ తీరాన ఆకట్టుకున్న ఈశ్వరుని సైకత శిల్పాలు
★ఎచ్చెర్ల: తగ్గిన టమాట ధర
News February 18, 2026
ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.
News February 18, 2026
రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.


