News December 18, 2025

శ్రీకాకుళం: ట్రక్ షీట్ల జారీపై జేసీ సూచనలు

image

ధాన్యం కొనుగోలులో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ట్రక్ షీట్లపై శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కీలక సూచనలు చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 లోపు ట్రక్ షీట్లను జారీ చేయొద్దని సిబ్బందికి సూచించారు. మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం RSK పరిధిలో బుధవారం వేకువజామున 3 గంటలకు 10 ట్రక్ షీట్లు ఇవ్వడంపై కోసమాల, నందిగం, సోంపేట PACS పరిధిలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు.

Similar News

News December 26, 2025

SKLM: గంజాయి రహిత జిల్లానే లక్ష్యం- ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 115 గంజాయి హాట్-స్పాట్లను గుర్తించామని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఉంచామన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

News December 26, 2025

SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News December 26, 2025

శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

image

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.