News June 22, 2024

శ్రీకాకుళం: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

Similar News

News October 5, 2024

భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.

News October 4, 2024

DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి

image

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.

News October 4, 2024

ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు

image

కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం,స్థానిక నాయకులు, ప్రజలకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.