News August 19, 2024

శ్రీకాకుళం డీఎస్పీగా వివేకానంద

image

రాష్ట్రంలో డిఎస్పీలను బదిలీ చేస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డిఎస్పీగా సిహెచ్ వివేకానందాను డిఎస్పీ వై.శ్రుతి స్థానంలో నియమించారు. అలాగే శ్రీకాకుళం స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఏ.త్రినాథరావును విశాఖపట్టణం డీఎస్‌ఆర్పీ విభాగానికి బదిలీ చేశారు. ఈయన స్థానంలో జిల్లాలో ఎవరినీ నియమించలేదు. డీఎస్పీ వైస్ శ్రుతికి ఎక్కడా నియమించకపోవడంతో రిపోర్ట్ చేయాలన్నారు.

Similar News

News July 5, 2025

జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలు గుర్తింపు: కలెక్టర్

image

జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 181 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై 15లోగా మిగతా కుటుంబాలకు దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని అన్నారు. పాతపట్నంలో అత్యధికంగా నమోదయ్యారన్నారు.

News July 4, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు

News July 4, 2025

ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.