News October 24, 2024

శ్రీకాకుళం: త్వరలో వైసీపీ జిల్లా కమిటీలు- కృష్ణదాస్

image

వైసీపీ జిల్లా అన్ని స్థాయిల కమిటీలను త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో శ్రీకాకుళంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించేలా ఉండాలని అభిప్రాయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా కమిటీలు నియమించి, ప్రకటించాలని తీర్మానించారు.

Similar News

News October 23, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం నగరంలోని 80 ఫిట్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై కారును అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

News October 23, 2024

SKLM: గంజాయి అక్రమ రవాణా అరికట్టాలి: ఎస్పీ

image

జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ KV మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డిపిఎస్, సైబర్, ఎన్బిడౌబ్లు, ప్రాపర్టీ, క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ తదితర కేసులపై సమీక్షించారు.

News October 23, 2024

హైదరాబాద్‌లో గుండెపోటుతో సిక్కోలు వాసి మృతి

image

హైదరాబాద్‌లో పెయింటింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సిక్కోలు వాసి గుండెపోటుతో మృతిచెందాడు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన కూన గణపతిరావు (39) బుధవారం HYDలో గుండెపోటుతో మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం నాటికి మృతదేహం స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.