News April 5, 2024
శ్రీకాకుళం: నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థుల ప్రకటన

జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.
Similar News
News December 12, 2025
రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 12, 2025
శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖుర్దా రోడ్డు డివిజన్లోని రాజ్ అథ్గర్, జోరాండా రోడ్డు మధ్య 3వ, 4వ లైన్ల ప్రారంభోత్సవం దృష్ట్యా విశాఖ-అమృత్సర్-విశాఖ (20807/08), గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్(18117/18) రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20వ తేదీలలో అమలులో ఉంటుందని GM పరమేశ్వర్ తెలిపారు.
News December 12, 2025
శ్రీకాకుళం: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా విఠల్

కూటమి ప్రభుత్వం 13 జిల్లాల గ్రంథాలయ చైర్మన్లను గురువారం రాత్రి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా పలాస నియోజకవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ రావును నియమించింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.


