News July 8, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి ఉచితంగా ఇసుక
నేటి నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. జిల్లాలో రెండు నిల్వకేంద్రాల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను టన్ను రూ.340 ధరకు సామాన్యులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 6, 2024
అంపైర్గా సిక్కోలు వాసి
విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.
News October 6, 2024
SKLM: నేటి నుంచి IIITకి సెలవులు
ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 6, 2024
‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’
వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.