News September 7, 2024

శ్రీకాకుళం: పదో తరగతి సాధారణ పరీక్షల్లో మార్పులు: డీఈవో

image

పదో తరగతి సాధారణ పరీక్షలు మార్చి-2025లో సప్లమెంటరీ పరీక్షలు మేలో జరుగుతాయని DEO తిరుమల చైతన్య తెలిపారు. నూతన సిలబస్ నమూనా ప్రశ్నాపత్రములు WWW.bseap.gov.in లో ఉంటాయన్నారు. నూతన సిలబస్ పాఠ్యపుస్తకాల ఆధారంగా పరీక్షలు జరుగుతాయన్నారు. 2023-24 అంతకు పూర్వం మార్చి, మే, జూన్ పరీక్షలలో ఫెయిలైన వారికి పాత సిలబస్ ఆధారంగా పరీక్షలు ఉంటాయన్నారు.

Similar News

News October 31, 2025

‘ఉద్యోగంలో చేరేందుకు..ఆ టీచర్‌కు 10 రోజులే డెడ్ లైన్’

image

పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌ (జీవ శాస్త్రం) అంగూరు చంద్రరావు 2022 నుంచి విధులకు గైర్హజరయ్యారు. దీనిపై పలు మార్లు హెచ్‌ఎంకు డీఈవో నోటీసులిచ్చినా వివరణ ఇవ్వలేదు. ఈ ఏడాది MAR’3వ తేదీన ఇచ్చిన చివరి నోటీసుకు ఉద్యోగి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోగా నేటి వరకు విధుల్లో చేరలేదు. 10 రోజుల గడువులో హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని డీఈవో రవిబాబు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.

News October 31, 2025

SKLM: ‘డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలి’

image

డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 32 అభ్యర్థుల్లో 10 మందిని డ్రైవింగ్ శిక్షణకు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 31, 2025

కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని ఒకరు సూసైడ్

image

కోటబొమ్మాళి(M) నరసింగపల్లిలోని తోటల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.