News September 20, 2024
శ్రీకాకుళం: పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మాజీ స్పీకర్ సీతారాం

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి MP సెగ్మెంట్ ఇన్ఛార్జ్గా ఆమదాలవలస మాజీ MLA తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్లు YCP అధినేత జగన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో, MLAలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పదవులు కేటాయించినట్లు సమాచారం.
Similar News
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు

నేడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషిచేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. బుడగట్లపాలెం సముద్ర తీర ప్రాంతంలో అనువైన పరిస్థతిని కల్పించి మత్య్సకారులతో సీఎం నేరుగా మాట్లాడేందుకు అవకాశం దక్కిందన్నారు.
News May 7, 2025
పలాస: మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస(M) ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 21న మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికి 5 రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి మృతదేహం స్వగ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లాకు వరాలు కురిపిస్తారా?

మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు CM చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పి వలసలు అరికట్టేలా ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైడిభీమవరంలో పారిశ్రామికవాడ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.