News June 27, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షలు రాసిన వారికి ముఖ్య గమనిక

image

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో మే- 2024లో నిర్వహించిన MSC (హోమ్ సైన్స్)నాలుగవ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News July 1, 2024

శ్రీకాకుళం వ్యాప్తంగా 1,43,008 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.40 గంటలకు 1,43,008 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా ఇప్పటికే జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ పై ఆరా తీసిన జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో పరిశీలించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛను అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజే శత శాతం పూర్తి కావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

News July 1, 2024

శ్రీకాకుళం: రీ కౌంటింగ్ దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. జూన్ 27న దరఖాస్తులు ప్రారంభం కాగా జులై 1వ తేదీతో గడువు ముగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1338 మంది విద్యార్థులు ఈ 10వ తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించారు. వీరందరూ నేడు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.