News June 18, 2024
శ్రీకాకుళం: ప్రయాణికులకు APSRTC కీలక సూచన

శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికి APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866- 149 నంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాకు తాగునీరు కలుషితమే కారణమా?

శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం డయేరియా సమస్యగా మారింది. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. తాగునీటి కలుషితమే డయేరియాకు కారణమా అన్న చర్చ సాగుతోంది. నీటి సరఫరా కులాయిల్లోకి డ్రైనేజీ నీరు చేరి ఉంటుందని భావిస్తున్నారు. నీటి నమూనాలను విశాఖ ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితం అతిసార వ్యాధికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనా.
News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాపై ప్రభుత్వం సీరియస్

శ్రీకాకుళం పట్టణంలో ప్రబలిన డయేరియాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఉన్నతస్థాయి నివేదిక తెచ్చుకున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై అధ్యయనం చేస్తోంది. ముందుగా మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేసింది. మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ అధికార యంత్రాంగంలో కొనసాగుతోంది. ప్రారంభంలో నియంత్రించలేక పోవటం వల్ల కేసులు పెరిగాయి అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
News February 25, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.


