News March 25, 2024
శ్రీకాకుళం: భల్లూకాల దాడులు.. వణికిపోతున్న ప్రజలు

వజ్రాపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లోని గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. జీడిపిక్కల కాలం కావడంతో సంచారిస్తున్నాయి. రైతులు, కూలీలు పనులకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళన గురి అవుతున్నారు. శనివారం ఇద్దరిని ఎలుగు పొట్టన పెట్టుకుంది. అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయకపోవడంతోనే దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళంలో 64 మంది డయేరియా బాధితులు

శ్రీకాకుళంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 64 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇద్దరు అత్యవసర చికిత్స పొందుతున్నారని చెప్పారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News February 25, 2026
శ్రీకాకుళంలో డయేరియా.. అధికారుల ప్రత్యామ్నాయం

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్లో డ్రైనేజ్ నీరు చేరటం వల్ల నీరు కలుషితమైందన్న అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. మరో పక్క కుళాయిల ద్వారా సరఫరా చేసిన తగునీటిని విశాఖపట్నానికి పరీక్షల నిమిత్తం పంపారు.
News February 25, 2026
శ్రీకాకుళం: 70 ఏళ్ల వయసులో పరీక్ష

డీఈవోగా, డిపెప్ (ప్రస్తుత సర్వశిక్షా అభియాన్) ఏపీసీగా సేవలందించి పదవీ విరమణ చేసిన బలివాడ మల్లేశ్వరరావు చదువుపై తన ఆసక్తిని మరొకసారి చాటుకున్నారు. వమరవల్లి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సీనియర్ లెక్చరర్గా పనిచేసిన ఆయన సుమారు 70 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఇప్పటికే అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసిన ఆయన మంగళవారం బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పరీక్ష రాశారు.


