News December 21, 2025

శ్రీకాకుళం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. పోలాకి మండలంలో MLA బగ్గు రమణమూర్తి ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు.

Similar News

News December 24, 2025

శ్రీకాకుళం: రైల్వే ట్రాక్ దాటుతుండగా వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం GRP పరిధి నెల్లిమర్ల- విజయనగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. తిరుచునాపల్లి నుంచి హౌరా వెళ్లే రైలు వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ను దాటుతుండడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు.

News December 24, 2025

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

image

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.