News April 15, 2025
శ్రీకాకుళం: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ

మెగా డీఎస్సీ (ఎస్జీటీ & స్కూల్ అసిస్టెంట్- అన్ని సబ్జెక్టులు) పరీక్షలకు సిద్ధమవుతున్న జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ)ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్లైన్ శిక్షణను అందిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉండే ఈ శిక్షణకు టెట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News September 11, 2025
నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

నేపాల్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.
News September 11, 2025
ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News September 11, 2025
నేపాల్లో తెలుగువారి కోసం కలెక్టరేట్లో హెల్ప్లైన్

నేపాల్లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.