News December 23, 2025

శ్రీకాకుళం: ‘రూ.80 వేలు కడతావా.. అరెస్ట్ అవుతావా’

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్‌ 1930 ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 25, 2025

SKLM: రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు

image

రథసప్తమిపై ప్రజల అభిప్రాయ, సలహాల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించాలి కోరారు.

News December 25, 2025

శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

image

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.

News December 25, 2025

మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

image

ఈనెల 26న మీ చేతికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.