News August 28, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC)- యశ్వంత్పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02863 SRC- YPR రైలును Sept 4 నుంచి Sept 18 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- SRC మధ్య నడిచే రైలును Sept 6 నుంచి Sept 20 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News August 28, 2025
శ్రీకాకుళం: సావిత్రమ్మ నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.
News August 26, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి: SP

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.
News August 26, 2025
టెక్కలిలో లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు, ఏపీ సెట్, యూజీసీ నెట్ అర్హత, పీహెచ్డీ అర్హత కలిగిన వారు ఆగష్టు 30న కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావలన్నారు.