News September 14, 2024
శ్రీకాకుళం రోడ్డు వరకే ప్రయాణించనున్న మెము రైళ్లు

పూండి- నౌపాడ, తిలారు- కోటబొమ్మాళి సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ భద్రతా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 21 తేదీలలో విశాఖ- పలాస మధ్య ప్రయాణించే మెము రైళ్లను(నం.07470, 07471) శ్రీకాకుళం రోడ్డు వరకే నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున ఆయా తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు- పలాస స్టేషన్ల మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేశామన్నారు.
Similar News
News February 28, 2026
SKLM: తగ్గుముఖం పట్టినంతవరకు వైద్య బృందం అప్రమత్తం

శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా తగ్గుముఖం పట్టినంత వరకు వైద్యాధికారుల బృందం అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి అన్నారు. శనివారం దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మకోవెల, తదితర అతిసార ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అతిసారం తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆరుబయట ఆహార పదార్థాలు తినరాదని, కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు.
News February 28, 2026
SKLM: ప్రొబిషనరీ నియామకాలపై అభ్యంతరాలకు లాస్ట్ డేట్..

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్/ప్రభుత్వ మునిసిపల్ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొబిషనరీ నియామకాలు చేపట్టింది. ఈ మేరకు డీఈవో రవిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమాలకు సంబంధించిన వివరాలు https://www.sites.google.com/site/deosklorg/లో చూసి మార్చి 7వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు.
News February 28, 2026
SKLM: డయేరియా ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్స్ నియామకం

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 21 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో వార్డులో ఆరుగురు ఉద్యోగులు ఉదయం 5.30 నుంచే విధుల్లో ఉంటారని అన్నారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని వార్డు సచివాలయాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారన్నారు.


