News June 22, 2024
శ్రీకాకుళం: లవ్ మ్యారేజ్.. వివాహిత కిడ్నాప్
వివాహిత కిడ్నాప్ ఘటనపై కేసు నమోదుచేసినట్లు వన్టైన్ SI శ్యామల రావు తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన జి.తేజేశ్వరరావు పొన్నాడకు చెందిన వల్లంగి పల్లవి ప్రేమ పెళ్లిచేసుకున్నారు. మంగువారితోటలో నివాసముంటున్నారు. కాగా ఈ నెల 20న సుశీల కొంతమందితో తేజేశ్వరరావు ఇంటికి వెళ్లి పల్లవిని తీసుకెళ్లిపోయింది. దీంతో తేజేశ్వరరావు తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.
Similar News
News October 5, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి దసరా సెలవులు
డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలకు ఈనెల 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ దసరా సెలవులు (6వ తేదీ ఆదివారం సెలవు ) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పీలా సుజాత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 13వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 14 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ప్రకటనలో సూచించారు.
News October 5, 2024
భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
News October 4, 2024
DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.