News September 23, 2025
శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు
Similar News
News September 23, 2025
ఎచ్చెర్ల: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆందోళన చెందవద్దు

ఫీజు రియంబర్స్మెంట్ పై కళాశాలల యజమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్తో, ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోమవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు విడతల వారిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు త్వరలో చెల్లింపునకు, రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన ఆయన పేర్కొన్నారు.
News September 22, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 63 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News September 22, 2025
కోటబొమ్మాళి: హెలికాఫ్టర్ రైడ్కు వెళ్తున్నారా.. ఇది గమనించండి

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్కు వెళ్తున్నారా? అయితే ఇది గమనించాలని నిర్వాహకులు చెబుతున్నారు. రైడ్ టికెట్ రూ.2 వేలుగా నిర్ణయించారు. టికెట్ కావాల్సిన వారు కేవలం క్యాష్ మాత్రమే తీసుకురావాలని, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చెల్లవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ తెలిపారు. పర్యాటకులు గమనించాలని ఆయన కోరారు.