News April 1, 2024

శ్రీకాకుళం: విద్యార్థుల భద్రత కళాశాల యాజమాన్యానిదే : ఎస్పీ

image

కళాశాల, పాఠశాల, వసతి గృహలకు వచ్చిన విద్యార్థి విద్యార్థినీలు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఎస్పీ రాధిక సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోధనేతారా సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలను కౌన్సెలింగ్ నెపంతో పిలిస్తే కాలేజ్ యాజమాన్యంకు చెప్పాలన్నారు.

Similar News

News April 5, 2026

నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

image

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News April 5, 2026

సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

image

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

News April 5, 2026

గార: 80 ఏళ్లలో మరొకరికి వెలుగునిచ్చిన భార్యాభర్తలు

image

గార మండలంలోని శ్రీకూర్మానికి చెందిన అంధవరపు రూపవతి(82) శుక్రవారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్నారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు సుజాత, పి.చిన్ని కృష్ణల ద్వారా ఆమె కార్నియాలను సేకరించారు. ఇటీవలే భర్త బాలకృష్ణ మూర్తి (88) కూడా నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.