News March 25, 2024

శ్రీకాకుళం: విద్య అందరికీ అందుబాటులో ఉండాలి

image

విద్యారంగంలో లౌకిక భావజాలం అవసరమని, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో అప్పారి వెంకటస్వామి 23వ వర్ధంతి సందర్భంగా విద్యారంగం-లౌకిక భావజాలం అనే అంశంపై సదస్సు ఆదివారం నిర్వహించారు. సమాజంలో ఉత్పత్తి క్రమం ప్రారంభించి 12 వేల సంవత్సరాలు మాత్రమే అయిందన్నారు.

Similar News

News July 3, 2024

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), SMVT బెంగళూరు(SMVB) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.08845 SRC- SMVB ట్రైన్‌ను జులై 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, నం.08846 SMVB- SRC ట్రైన్‌ను జులై 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News July 3, 2024

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ నేపథ్యం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.

News July 3, 2024

శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.