News July 1, 2024
శ్రీకాకుళం: 25,760 మంది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719789844506-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 1, 2 సంవత్సరం చదువుతున్న 25,760 మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నామని డివైఈవో శివ్వాల తవిటినాయుడు ఆదివారం తెలిపారు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 13 మోడల్ స్కూల్ కాలేజీలు, 25 కేజీబీవీలు, 9 సోషల్ వెల్ఫేర్, 12 హైస్కూల్ ప్లస్, ఒక్కొక్క ఎస్టి, మహాత్మ జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి.
Similar News
News July 3, 2024
శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేపథ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972351285-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా 2022 ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించారు.
News July 3, 2024
శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972962555-normal-WIFI.webp)
పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 3, 2024
హత్రస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ సానుభూతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719940075465-normal-WIFI.webp)
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హత్రస్ తొక్కిసలాట బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. మంగళవారం యూపీలోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం, పలువురు గాయపడటం బాధాకరమని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.