News May 11, 2024
శ్రీకాకుళం: 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు

జిల్లాలో 2358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాలలో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ జీ.ఆర్ రాధిక గుర్తించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. హింస జరిగే అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉందన్నారు.
Similar News
News September 12, 2025
కోటబొమ్మాళి: విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతి

కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
News September 12, 2025
SKLM: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డాక్టర్ అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను జిల్లావ్యాప్తంగా వినియోగిస్తామన్నారు.
News September 12, 2025
పెద్దమ్మ కోసం హైదరాబాద్ రైలు ఎక్కిన పలాస బాలుడు

పలాసకు చెందిన ఓ బాలుడు హైదరాబాదులో ఉంటున్న వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గురువారం పలాస రైల్వే స్టేషన్లో విశాఖఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం అర్ధరాత్రికి రైలు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు వివరాలను అడిగగా తనది పలాస అని చెప్పాడు. ఈ బాలుడిని గుంటూరు రైల్వే ఛైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉంచారు.