News June 30, 2024
శ్రీకాకుళం: 341 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719753565698-normal-WIFI.webp)
పెద్దమడి గురుకుల పాఠశాలలో 341 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. గతంలో ఉన్న 17 మంది గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో క్లాసులకు అంతరాయం ఏర్పడింది. డీఎస్సీలో తమ పోస్టులు కలపడంతో తమకు న్యాయం చేయాలని గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో సమస్య ఏర్పడిందని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్ అజిత్ తెలిపారు.
Similar News
News July 5, 2024
శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720170463987-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
News July 5, 2024
శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169676712-normal-WIFI.webp)
అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
News July 5, 2024
శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్ఫోర్స్కు దరఖాస్తులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720163739132-normal-WIFI.webp)
అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.