News July 3, 2024
శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే ఆఖరు

జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష రుసుము చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు జూలై 3వ తేదీ సాయంత్రంలోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు మొత్తం యూనివర్సిటీ మైగ్రేషన్ ఫీజుతో కలిపి 1,635 ఫీజులు చెల్లించాలి. జూలై 19వ తేదీ నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News April 14, 2026
మహిళలే నేటి మహారాణులు: మంత్రి అచ్చెన్నాయుడు

మహిళలే నేటి మహారాణులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఆటోలను మహిళలకు అందజేశారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News April 14, 2026
శ్రీకాకుళం జిల్లాలో 35 ఏళ్ల యువకుడు సూసైడ్

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడియా రామారావు(35) మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మందస, సోంపేట మండలాల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా మృతుడు ఉన్నాడు.
News April 14, 2026
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: అచ్చెన్న

అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని మంత్రి అచ్చెన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ కూడలిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం లక్ష్యమని అచ్చెన్న అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు.


