News April 2, 2024

శ్రీకాకుళం: REWIND: ద్విసభ్య విధానం అంటే?

image

ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే వాటిని ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఇవి పార్లమెంటుకే కాక, రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్రం తరువాత కూడా కొనసాగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. ఈవ్యవస్థలో లోపాలు ఉండటంతో కాంగ్రెస్ 1961లో రద్దు చేసింది. 1952లో పాతపట్నం ద్విసభ్య ఎన్నికలు జరిగాయి.

Similar News

News October 26, 2025

పాతపట్నం: ‘గురుకుల పాఠశాలను సందర్శించిన సమన్వయ అధికారి’

image

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని, విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మీ అన్నారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని, డార్మెటరీని, మరుగుదొడ్లను పరిశీలించారు.

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈శ్రీకాకుళం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
◈శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయ్యేదెన్నడు..?
◈టెక్కలి: జిల్లాలో రవాణాశాఖ అధికారుల విస్తృత తనిఖీలు
◈మందస: అగ్నిప్రమాదంలో నాలుగు పూరిల్లు దగ్దం
◈ఆదిత్యుని సేవలో హై కోర్టు జస్టిస్
◈టెక్కలి: పశువైద్య మందుల కొరత తీర్చండి
◈గార: నాగులచవితి వేడుకలకు ఆ గ్రామం దూరం

News October 25, 2025

శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

image

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.