News February 24, 2025

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాల సమర్పించనున్న మంత్రి ఆనం 

image

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది(మంగళవారం)   స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. 

Similar News

News February 24, 2025

రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

News February 24, 2025

జగిత్యాల: 48 గంటల పాటు మద్యం షాపులు బంద్

image

జగిత్యాల జిల్లాలో 48 మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని మద్యంషాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు 25-02-2025 సాయంత్రం 4 గంటల నుంచి 27-02-2025 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News February 24, 2025

భువనగిరి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. వీరారెడ్డిపల్లికి చెందిన మంద చంద్రయ్య అప్పుల బాధతో మనోవేదనకు గురై పంట పొలానికి తెచ్చిన పురుగు మందును తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. 

error: Content is protected !!