News October 21, 2025

శ్రీగిరిపై రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

image

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21వ తేదీ వరకు నిర్వహించే ఈ మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం సిద్ధం చేస్తోంది. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంలో భాగంగా పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 21, 2025

రేపటి నుంచే కార్తీక మాసం

image

ఇవాళ్టితో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. రేపటి(OCT 22) నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్‌ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో దీపాలు వెలిగిస్తూ, పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, వనభోజనాలతో ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.

News October 21, 2025

MNCM: పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివి: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద సీపీ అంబర్ కిషోర్ ఝా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని అన్నారు. ప్రజలు, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.

News October 21, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి అందజేశారు.