News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
వంటింటి చిట్కాలు

* బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ను వేయండి. బిస్కెట్లు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
* చక్కెరను పొడి చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేస్తే ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.
* నిమ్మజాతి పండ్లూ, టమాటాలు ఫ్రిజ్లో పెడితే వాటిల్లోని సువాసన తగ్గిపోతుంది.
* వంటింట్లో వాడే స్పాంజిలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు, దుర్వాసన పోతాయి.
News February 24, 2026
RRR కేసులో నన్ను ఇరికించారు: సునీల్

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న <<19220184>>IPS సునీల్ నాయక్<<>> Xలో సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈ కేసులో నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. EX CM జగన్, IPS PV సునీల్కు వ్యతిరేకంగా చెప్పకపోతే నేరస్థుడివి అవుతావని ఫిర్యాదుదారుడు నన్ను బెదిరించాడు. RRR కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని ప్రభావితం చేశారో తెలుస్తుంది. త్వరలో ఆధారాలు బయటపెడతా’ అని పేర్కొన్నారు.
News February 24, 2026
రైల్ పార్సిల్ యాప్తో హోమ్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి

డోర్ టు డోర్ పార్సిల్ బుకింగ్, డెలివరీ సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) దేశంలోనే తొలి ‘రైల్ పార్సిల్ యాప్’ను తీసుకొస్తోంది. రేపు HYD డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనుంది. రైల్వే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లి పార్సిళ్లను తీసుకొని డెలివరీ చేస్తారు. సేవల నిర్వహణ, లాజిస్టిక్స్ మార్కెట్పై స్టడీ చేసేందుకు IIM బెంగళూరుతో రైల్వే శాఖ ఒప్పందం చేసుకోనుంది.


