News September 5, 2025

శ్రీలంకలో కావలి మాజీ MLA..?

image

కావలి MLA కృష్ణారెడ్డి హత్యకు ప్లాన్ చేశారంటూ మాజీ MLA ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని కోర్టు ప్రశ్నించగా ‘ఆయన దేశంలో లేరు. శ్రీలంకలో ఉన్నట్లు దర్యాప్తు అధికారి గుర్తించారు. MLA హత్యకు ఆయన ప్లాన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. కేసును క్వాష్ చేయవద్దు’ అని గవర్నమెంట్ లాయర్ కోరారు. ఈనెల 10కి ఈ కేసు వాయిదా పడింది.

Similar News

News September 6, 2025

7న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం మూసివేత

image

నెల్లూరు దర్గా మిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి సోమవారం ఉదయం 6:30 గంటల వరకు మూసి వేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి సోమవారం ఉదయం 8 గంటల నుంచి పూజలు, సర్వదర్శనం ఉంటుందన్నారు.

News September 5, 2025

ఆ బాధ్యత టీచర్లదే : కలెక్టర్

image

జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు. ప్రభుత్వ, ప్రవేట్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యారంగా అభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యావ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు శిక్షణ పొందాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

News September 5, 2025

నెల్లూరు: ధాన్యం రేటు పతనంపై నిరసన

image

నెల్లూరు జిల్లాలో వరి పుట్టి మద్దతు ధరను ప్రభుత్వం రూ.19,720గా ప్రకటించింది. దళారులు, మిల్లర్లు కలిసి రూ.16వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘ నాయకుడు గంగపట్నం రమణయ్య ఆరోపించారు. పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం, మిల్లర్లు, దళారుల దోపిడిపై ఈనెల 8న రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని ప్రకటించారు.