News August 23, 2024
శ్రీవారిమెట్లు నడకదారిలో పురుగులమందు తాగిన ప్రేమజంట

శ్రీవారిమెట్లు నడకదారిలో ఓ ప్రేమ జంట పురుగులమందు తాగింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ ఓ యువకుడి ప్రేమలో పడింది. 3 రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడకమార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంటది చిత్తూరుటౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీశ్, రాధికలుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News December 17, 2025
సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.
News December 17, 2025
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News December 16, 2025
చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.


