News February 27, 2026

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం

image

హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.

Similar News

News February 28, 2026

కసాయి తల్లి.. కన్నబిడ్డనే చెత్తకుప్పలో పడేసింది!

image

సత్యసాయి జిల్లా: కన్నప్రేమ కరువైందో లేక కనికరం చచ్చిందో కానీ, సోమందేపల్లి మండలం నడింపల్లిలో ఒక పసికందు పురిటిలోనే అనాథగా మారింది. నవమాసాలు మోసి, రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే అమ్మే ఆ పసి ప్రాణాన్ని చెత్తదిబ్బలో పడేసింది. శనివారం ఆ చిన్నారి ఏడుపు విని గ్రామస్థులు పరుగున వెళ్లి చూశారు. ప్రస్తుతం ఆ చిన్నారి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

News February 28, 2026

పార్టీ ఏర్పాటుకు ముందు క్లీన్‌చిట్.. ఇక దూకుడేనా?

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు ముందు నిర్దోషిగా తేలడం ఆమెకు సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు BRS నుంచి మద్దతు లభించలేదని కవిత పలుమార్లు వాపోయారు. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత ‘లిక్కర్ క్వీన్’ అంటూ పలువురు BRS శ్రేణులు ఆమెను విమర్శించాయి. మరి ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.

News February 28, 2026

బైరెడ్డి ఎప్పటికీ నా శత్రువే: గౌరు వెంకటరెడ్డి

image

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు ఎప్పటికీ శత్రువేనని టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అతడు ఎన్నడూ మాట మీద నిలబడలేదని విమర్శించారు. తనపై గతంలో రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారని ఆరోపించారు. కేవలం సీఎం చంద్రబాబుపై గౌరవంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. ఎంపీ శబరి ఎమ్మెల్యేల సహకారంతో నియోజకవర్గ పర్యటనలు చేస్తే బాగుంటుందని సూచించారు.