News February 21, 2025

శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

image

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దేవస్థానం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని బ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగ ణంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కూచిపూడి నృత్యప్రదర్శన, భరతనాట్యం, మహాశివరాత్రి వైభవం ప్రవచనం, వేణుగానం తదితర కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.

Similar News

News February 22, 2025

ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

image

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT

News February 21, 2025

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

image

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్ట‌ర్‌ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.

News February 21, 2025

కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం

image

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

error: Content is protected !!