News October 12, 2025

శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: SP

image

ఈనెల 16న ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలలు, నల్లమల అడవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

Similar News

News October 12, 2025

TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286‌ను సంప్రదించాలన్నారు.

News October 12, 2025

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

image

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.

News October 12, 2025

హనీట్రాప్ చేసిన మార్కాపురం యువకుడు

image

సంగారెడ్డి జిల్లా హత్నూర్ PS పరిధిలోని కోనంపేటకి చెందిన విద్యార్థి మనోజ్‌ను ప్రకాశం జిల్లా యువకుడు హనీట్రాప్ చేశాడు. అనంతరం అతనివద్ద నుంచి రూ.11,20,000 వసూలు చేసిన ఘటనలో మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.