News February 25, 2025
శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News December 21, 2025
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు: బీజేపీ

భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు. జార్జ్ సోరోస్తో లింక్ ఉన్న బెర్లిన్ హెర్టీ స్కూల్ అధ్యక్షురాలు కార్నెలియా వోల్తో రాహుల్ సమావేశమయ్యారని తెలిపారు. ఆయన విదేశీ పర్యటనల్లో పారదర్శకత ఉండాలన్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ సెషన్ సమయంలో/ముందు రాహుల్ విదేశాల్లో పర్యటించడం కొత్తేమీ కాదని, వాటి వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.
News December 21, 2025
‘గోట్ టూర్’ కోసం మెస్సీకి రూ.89 కోట్లు!

మెస్సీ గోట్ టూర్ నేపథ్యంలో కోల్కతా మైదానంలో జరిగిన అనుకోని సంఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్గనైజర్ శతాద్రు దత్తా సిట్ విచారణలో కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘ఈ టూర్ కోసం మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించాం. ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్ను కట్టాం. మొత్తం రూ.100 కోట్ల ఖర్చులో మెజారిటీ నిధులు స్పాన్సర్లు, టికెట్ల అమ్మకాల ద్వారా సేకరించాం’ అని చెప్పినట్లు తెలుస్తోంది.
News December 21, 2025
హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మేడారం, వరంగల్ చరిత్ర పుస్తకాలు

హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ‘సమ్మక్క'(ది గ్లోరీ ఆఫ్ మేడారం), ‘కాకతీయుల గురించి మరికొంత’.. పుస్తకాలు ప్రదర్శితం అవుతున్నాయి. ‘I&PR’ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ ఈ రెండు పుస్తకాలను రాశారు. ములుగు, వరంగల్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన స్థానిక చరిత్రపై అధ్యయనం చేశారు. జిల్లాల వారిగా ప్రత్యేకతలను తెలుపుతూ తెలంగాణ సారస్వత పరిషత్ తో కలిసి చరిత్ర నిఘంటువులను రూపొందిస్తున్నారు.


