News July 16, 2024
శ్రీశైలం ఈవోగా IAS అధికారి.?
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.
Similar News
News October 7, 2024
కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?
కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News October 7, 2024
నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా
నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.
News October 7, 2024
డోన్: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
డోన్లోని కొండపేట వాసి షేక్ మదార్వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.