News December 7, 2024
శ్రీశైలం డ్యామ్ను సందర్శించిన హీరో నాగార్జున

శ్రీశైలం డ్యామ్ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫొటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
Similar News
News July 11, 2025
MBNR: పి.వి.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పి.వి.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
పాలమూరు: PM KISAN… జాగ్రత్త సుమా!

రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6వేలు ‘PM-KISAAN’ పథకాన్ని అడ్డుపెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వాటిపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ యాప్లపై క్లిక్ చేయవద్దని, OTPలు ఎవరికి చెప్పవద్దని ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. SHARE IT
News July 10, 2025
MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.