News March 19, 2025

శ్రీశైల పశ్చిమ ద్వారం మన అలంపురం..!

image

శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన శైవ శివలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ అమ్మవారు కొలువయ్యారు. మహాశక్తి పీఠాల్లో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. 

Similar News

News November 1, 2025

వేలేరుపాడు: రూ.1,000 కోట్లు చెక్కు పంపిణీ చేసిన మంత్రి

image

వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన రూ. 1,000 కోట్ల భూసేకరణ పునరావాసం సంబంధించిన చెక్కిన సంబంధిత నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిర్వాసితులకు నేరుగా రూ.1,000 కోట్ల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని మంత్రి తెలిపారు.

News November 1, 2025

ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

image

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News November 1, 2025

ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.