News October 26, 2025
శ్రీ చైతన్యలో స్కాలర్షిప్ టెస్ట్.. లాప్టాప్ బహుమతి

పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కార్పొరేట్ విద్య అందించేందుకు శ్రీ చైతన్య ఐఐటీ-జేఈఈ & నీట్ అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ను నవంబర్ 2న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతిగా లాప్టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి ట్యాబ్లు ఇస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 98485 87584 నంబర్ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్ రవికిరణ్ తెలిపారు.
Similar News
News October 26, 2025
సిరిసిల్ల: TG BC ఫెడరేషన్ జిల్లాధ్యక్షుడిగా కిషన్

తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎర్రోజు కిషన్ను రాష్ట్ర అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న కిషన్.. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ఫెడరేషన్ ఎదుగుదలకు కృషి చేస్తానని కిషన్ మాటిచ్చారు.
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News October 26, 2025
పత్తిని ఇక్కడ అమ్ముకుంటేనే లాభం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,68,778 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని.. జిల్లావ్యాప్తంగా 57,23,951 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఆయన తెలిపారు.


