News March 15, 2025
శ్రీ సత్యసాయి: ఇంటర్ పరీక్షలకు 218 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-3 ప్రశ్నాపత్రం ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి శనివారం తెలిపారు. జనరల్ విద్యార్థుల్లో 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ విద్యార్థులలో 785 మంది విద్యార్థులకు గాను 747 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తం 218 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
Similar News
News March 16, 2025
WPL-2025 అవార్డ్స్ విజేతలు వీరే

☛ ఆరెంజ్ క్యాప్ – నటాలీ స్కివర్ బ్రంట్ (523 రన్స్, ముంబై ఇండియన్స్)
☛ పర్పుల్ క్యాప్ – అమేలియా కెర్ (18 వికెట్స్, ముంబై ఇండియన్స్)
☛ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – అమంజోత్ కౌర్ (ముంబై ఇండియన్స్)
☛ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – నటాలీ స్కివర్ బ్రంట్ (1523 PTS)
☛ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – హర్మన్ప్రీత్ కౌర్ (66 రన్స్)
News March 16, 2025
జుట్టు రాలుతుందా ? ఈ చిట్కాలు పాటించండి..!

విటమిన్ ‘D’ లోపం వల్ల జుట్టు రాలడం, పొడిబారటం, తెల్లగా మారటం జరుగుతుంది. గుడ్లు, మష్రూమ్ తినడంతో పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. క్యారట్ ,చిలగడ దుంపల వల్ల ‘ఎ’ విటమిన్ లోపం లేకుండా చూడవచ్చు. బాదం, పొద్దుతిరుగుడు గింజలు జుట్టు రాలడాన్ని నియంత్రించే పోషకాల్ని ఇస్తాయి. ఒత్తిడి కూడా వెంట్రుకలు రాలడానికి ఓ కారణం కాబట్టి మెడిటేషన్, యోగా చేస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు రాలే సమస్యను నియంత్రించవచ్చు.
News March 16, 2025
పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.