News April 16, 2025

 శ్రీ సత్యసాయి: కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన SP

image

నియోజవర్గ కేంద్రమైన మడకశిరలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. ప్రస్తుత కాలంలో నేరాలు అదుపు చేయడంలో, నేరస్తులను కనిపెట్టడంలో సీసీ కెమెరాలు వినియోగం ఎంతో అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా అందజేసిన దాతలను ఎస్పీ మంగళవారం సన్మానించారు.

Similar News

News November 6, 2025

SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

image

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

News November 6, 2025

T20WC-2026 వేదికలు ఖరారు!

image

ICC మెన్స్ T20WC-2026 వేదికలు దాదాపు ఖరారయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నైలో మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. పాక్ మ్యాచ్‌లను కొలంబోలో నిర్వహిస్తారు. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మొత్తం 20 టీమ్స్ 4 గ్రూపుల్లో ఆడతాయి. ప్రతి గ్రూపులోని టాప్-2 జట్లు సూపర్-8కి చేరతాయి. ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్-2 జట్లు సెమీస్‌కు వెళతాయి.