News February 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో మంటల్లో చిక్కుకొని వృద్ధుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407750970_727-normal-WIFI.webp)
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి సమీపంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మహబూబ్ బాషా అనే వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్ బాషా తన పొలం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన పొలం పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకుంది. తన చేనులోకి మంటలు ఎక్కడ పడతాయో అన్న ఉద్దేశంతో మహబూబ్ బాషా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పొగకు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 13, 2025
గుండెపోటుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739421224849_51904015-normal-WIFI.webp)
బిక్కనూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు (55) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు చెప్పారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు అకాల మరణం పట్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 13, 2025
LoC వద్ద రెచ్చిపోయిన పాక్.. తిప్పికొట్టిన భారత్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422082642_367-normal-WIFI.webp)
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు తెగబడగా భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల LoC వద్ద ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
News February 13, 2025
HYD: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739421552422_51459681-normal-WIFI.webp)
తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా.గోపాలకృష్ణ అన్నారు. బాచుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. తమ అభిరుచులను పిల్లలమీద రుద్దకుండా వారికి ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పారు.