News March 10, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News March 10, 2025
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటా సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తం, అద్దంకి దయాకర్, సీపీఐ నాయకుల బృందం పాల్గొన్నారు. సీపీఐ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు.
News March 10, 2025
జడేజా ‘పుష్ప-2’ సెలబ్రేషన్

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ను టీమ్ ఇండియా ఆల్రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
News March 10, 2025
చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.