News March 3, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 214 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులలో 9,256 మంది విద్యార్థులకు గానూ 9,080 మంది హాజరైనట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,141మంది విద్యార్థులకు గానూ 1,103 మంది హాజరయ్యారన్నారు. 214 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.
Similar News
News December 29, 2025
TU: ‘అపరాధ రుసుముతో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించండి’

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా B.Ed, B.P.Ed మొదటి, మూడవ సెమిస్టర్ విద్యార్థులు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు సోమవారమే ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో నేడు ఫీజు చెల్లించవచ్చన్నారు. సెమిస్టర్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తామని, విద్యార్థులు తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.
News December 29, 2025
ఇవాళ అసెంబ్లీలో..

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. అనంతరం సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయమై BAC నిర్ణయం తీసుకోనుంది. JAN 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్ జలాలపై చర్చ జరగనుంది. కాగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని BRS పట్టుబడుతోంది.
News December 29, 2025
నరసరావుపేటలో కాలేజీ ప్రిన్సిపల్పై కత్తితో దాడి

నరసరావుపేటలో ఓ కాలేజీ ప్రిన్సిపల్పై దాడి జరిగింది. సోమవారం ఉదయం ప్రిన్సిపల్ శ్రీనివాసరావు వాకింగ్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


