News March 7, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 244 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథరెడ్డి శుక్రవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 9,410 మందికి గానూ 9,202 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,151 మందికి గానూ 1,114 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 244 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News July 9, 2025
మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
News July 9, 2025
నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.