News October 9, 2025

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్

image

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన గతంలో కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న అభిషేక్ కుమార్ బదిలీ అవ్వడంతో మౌర్య భరద్వాజ్‌ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మౌర్య బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Similar News

News October 10, 2025

సంగారెడ్డి: ‘అర్థమయ్యేలా పుస్తకాలు రూపొందించడం అభినందనీయం’

image

విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా పుస్తకాలు రూపొందించడం అభినందనీయమని సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ అన్నారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు జోష్ణ, కంప్యూటర్ అప్లికేషన్ అధ్యాపకులు నాగప్రసాద్ రూపొందించిన పుస్తకాలను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

News October 10, 2025

జూబ్లీహిల్స్‌ : ఓపెన్‌ వర్సిటీలో నేడు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

image

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టైఫండ్‌ బేస్డ్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులక ఈ-ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో 8 ప్రముఖ రిటైల్‌ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ఉ.10 గంటలు నుంచి సీఎస్‌టీడీ భవనంలో ప్రారంభమవుతుందని తెలిపారు.

News October 10, 2025

కాబుల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు?

image

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌పై పాక్ వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాబుల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో తాను మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని TTP చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ ఖండించారు. కాగా AFG ప్రభుత్వం TTP ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తోందని PAK రక్షణ మంత్రి ఇటీవల ఆరోపించారు.